శుక్రవారం రోజు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  మెహిదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న కారు శుక్రవారం మధ్యాహ్నం పిల్లర్ నంబర్ 292 వద్ద  బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం లో పలువురు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. అక్కడి స్థానికులు బాధితులను వెంటనే సమీపంలో గల హాస్పిటల్ కి తరలించగా అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. వెంటనే అలెర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని కారును తీయించి ట్రాఫిక్ ని క్లియర్ చేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: