తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి సిద్దిపేట జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ ప్రమాదం జరిగింది.. వేగంగా వస్తున్న మంత్రి హరీశ్ రావ్ కాన్వాయ్ కు సిద్దిపేట జిల్లా దుద్దెడ వద్ద ప్రమాదం జరిగింది. అడివి పందులు ఎదురుగా రావడంతో కాన్వాయ్ లో ముందుగా వెళుతున్న సడన్ గా బ్రేకులు వేసింది. 

అయితే ఆ ఎదురుగా ఉన్న వాహానాన్ని మంత్రి హరీశ్ రావు కారు డీ కోట్టింది.  ఈ ప్రమాదంలో హరీష్ రావు ఎటువంటి గాయాలు కాకపోగా ఆయన గన్మెన్ అలాగే డ్రైవర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: