భార‌తీయ జ‌న‌తాపార్టీపై సీపీఎం నేత మ‌ధు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దేశాన్ని హిందూ రాజ్యంగా ఏర్పాటు చేయాల‌ని చూస్తోంద‌ని, అందుకు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వంత‌పాడుతున్నార‌ని మండిప‌డ్డారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ఆంధ్రుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఏర్పాటైంద‌ని, అటువంటి సంస్థ‌ను ప్ర‌యివేటీక‌రిస్తామంటూ ప్ర‌జ‌ల మాట‌ల‌ను కూడా ఖాత‌రు చేయ‌కుండా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఉద్య‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ మ‌ద్ద‌తిస్తాన‌న‌డం మంచి ప‌రిణామ‌మేన‌ని, బీజేపీ కూట‌మిలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌న్నీ బ‌య‌ట‌కు రావాల‌ని, లేదంటే వాటిని నిర్వీర్యం చేయాల‌ని ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. దేశం మొత్తాన్ని హిందూ రాజ్యంగా మార్చాల‌నే యోచ‌న‌లో ఉండ‌టంవ‌ల్లే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేసుకుంటూ, ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెడుతూ వ‌స్తోంద‌ని, ఈ ప్ర‌భుత్వంవ‌ల్ల ప్ర‌జ‌లు అనేక అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నార‌ని, అయినా ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఎవ‌రు చెప్పిన మాట విన‌డంలేద‌ని, త‌న‌కు తోచిన‌దాన్ని చేసుకుంటూ వెళితే ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp