దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపించింది అంటే చాలా దారుణంగా అత్యాచారాలు చేస్తున్న కామాంధులు కొంతమంది అయితే వివిధ కారణాలతో పగ ప్రతీకారాలు పెంచుకుని ఆడపిల్లలపై దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీస్తున్న ఉన్మాదులు కొంతమంది. ఇలా ఎంతోమంది ఇటీవల కాలంలో దారుణంగా ప్రవర్తిస్తూ ఆడపిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఎక్కడో ఒకచోట ప్రతిరోజు ఆడపిల్లలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూనే ఉన్నాయ్. ఇక ఇటీవల ఓ యువకుడు బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో యువతిని ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ యువతికి నిప్పు అంటించాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. పాలక్కాడ్ జిల్లాలోని కళ్యాణ్ ఘడ్ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే 23 ఏళ్ల యువకుడు స్నేహితురాలు అయిన యువతి ఇంటికి పిలిచాడు.ఈ క్రమంలోనే ఇక ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు సుబ్రమణ్యం.

 తర్వాత సదరు యువతి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమం లోనే అరుపులు విన్న బసుబ్రమణ్యం తల్లి తమ్ముడు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇక మాటల్లో వారికి తీవ్ర గాయాలు కావడం గమనార్హం. వైద్యం కోసం వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.. ఇక వారి పరిస్థితి ప్రస్తుతం విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమ లో ఉన్నట్లు వారి ప్రేమను రెండు కుటుంబాలు నిరాకరించిన కారణం గానే సుబ్రహ్మణ్యం ఇలా చేశాడని స్థానికులు కొంత మంది చెబుతూ ఉండటం గమనార్హం. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: