లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం సౌత్ యాక్ట్రస్ నయనతార స్థానంలో బాలీవుడ్ తార ఊర్వశి రౌతేలను తీసుకున్నారని తెలుస్తోంది. ఓ వెబ్ సిరీస్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందొచ్చిన వార్తల ప్రకారం, "ఇన్స్పెక్టర్ అవినాష్" అనే వెబ్ సిరీస్ లో నయనతారను లీడ్ రోల్ లోకి ఎంచుకున్నారు.

రీసెంట్ న్యూస్ ప్రకారం నయనతార స్థానంలో ఊర్వశిని ఎంచుకున్నారని టాక్. ఆ విధంగా రణదీప్ హూడాతో ఈ వెబ్ సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉర్వశికి దక్కింది.

జియో స్టూడియోస్ తో పాటు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేయబడుతున్న ఈ వెబ్ సిరీస్ ను నీరజ్ పాథక్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇటీవలే ఊర్వశి రౌతేలా ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి వెల్లడించింది. పూనమ్ మిశ్రాగా ఈ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నానని చెప్పుకొచ్చింది.

రియల్ లైఫ్ సూపర్ కాప్ అయిన అవినాష్ మిశ్రా భార్యగా కనిపించనున్నానని ఎగ్జైటయింది. రణదీప్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

ఈ వెబ్ సిరీస్ లో తన క్యారక్టర్ అనేది రియల్ లైఫ్ క్యారక్టర్స్ ను ఆధారంగా తీసుకుని మలచబడినదని ఊర్వశి చెప్పుకొచ్చింది. ఆ పాత్రలో జీవించేందుకు తాను ఎంతో హోమ్ వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ రోల్ తనకు దక్కడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

ఇదిలా ఉంటే, నయనతార ఈ వెబ్ సిరీస్ లో భాగమై ఉండుంటే ఆమె బాలీవుడ్ కు కూడా చేరువయ్యేది. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నయన్ కు ఈ అవకాశం కూడా బాగా కలిసొచ్చేది.

ఈ ఆఫర్ నయన్ చేతి నుంచి జారిపోవడం పట్ల అభిమానులు అప్సెట్ అయ్యారు. నయన్ ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఈ వెబ్ సిరీస్ లో కంటిన్యూ కాలేనని భావించి తానే స్వయంగా తప్పుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: