సూపర్ స్టార్ మహేష్ ఈ మధ్య సోషల్ యాక్టివిస్ లో పాటిస్పేట్ చేస్తుండటం విశేషం. ఇదవరకు అసలు సినిమాలో తప్ప బయట కనబడని మహేష్ సినిమాను ప్రమోట్ చేస్తే మంచి సక్సెస్ ని రాబట్టొచ్చని తెలుసుకున్నాడు. అందుకే శ్రీమంతుడుకి దగ్గరుండి మరి ప్రమోషన్ లో పాలుపంచుకున్నాడు. ఇక తన సినిమా అనే కాదు తనకు మంచిగా అనిపించిన సినిమాల ప్రస్థావన కూడా తెస్తున్నాడు ప్రిన్స్. బాహుబలి సినిమా గురించి లేటుగా స్పందించినా టాలీవుడ్ స్టాండర్డ్స్ ని పెంచిందని, సినిమా గొప్పతనాన్ని గురించి తన మాటల్లో చెబుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు మహేష్. ఇప్పుడు అదే దారిలో సల్మాన్ ఖాన్ నిర్మించిన సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించిన 'హీరో' సినిమా చూసి తన స్పందన తెలిపాడు సూపర్ స్టార్ మహేష్.


సూరజ్ పంచోళి, అథియా శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఈ సినిమా చూసిన మహేష్ సల్మాన్ కి కంగ్రాట్స్ చెప్పడంతో పాటుగా పరిశ్రమకు టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను ప్రమోట్ చేసినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ మధ్య టాలీవుడ్ కి బాలీవుడ్ కి మంచి సంబాధాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా జరిగిన మెగాస్టార్ బర్త్ డే బాష్ కి కూడా బాలీవుడ్ సిని ప్రముఖులంతా హాజరవ్వడం మనకు తెలిసిందే. ఇక బాహుబలి సినిమా అయితే ఒక్కసారిగా తెలుగు సినిమాల మార్కెట్ ని చాలా పెద్దదిగా చేసింది.

అయితే మహేష్ సల్మాన్ సినిమాను ప్రమోట్ చేయడం వెనుక ఇంకో కారణం ఏమై ఉంటుందా అంటే.. ప్రిన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు సినిమాను  బాలీవుడ్లో రీమేక్ కు సల్మాన్ దాదాపు ఓకే అన్నాడని వార్తలు వస్తున్నాయ్. ఆ కారణం చేతనే సల్మాన్ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన 'హీరో' సినిమాను ప్రమోట్ చేసే భాధ్యత తన మీద వేసుకున్నాడంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. కారణం ఏదైనా సరే మహేష్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా గురించి ట్వీట్ చేసి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారాడు. అయితే స్వతహాగా బాలీవుడ్ వైపు ఇప్పుడప్పుడే వెళ్లడం ఇష్టం లేని మహేష్ బాలీవుడ్ హీరోల సినిమా గురించి ఇంత ప్రమోట్ ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాని ప్రశ్న.
సో మొత్తనికైతే ఏ కారణం చేతనైతే సల్మాన్ సినిమాను పొగుడొతూ కండల వీరుడికి థాంక్స్ చెప్పాడు ప్రిన్స్ మహేష్ బాబు.  


మరింత సమాచారం తెలుసుకోండి: