టాలీవుడ్ లో ప్రస్తుతం మేకర్స్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే తమ సినిమాల్లో విలన్ పాత్రలు కానీ కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు కానీ రెగ్యులర్ నటి నటులు కాకుండా స్పెషల్ వ్యక్తులను నటింపజేస్తే సినిమాపై క్రేజ్ బాగా వస్తుందని అలాంటి నటులను ఎంపిక చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో అలా ప్రయోగాలు చేసి సక్సెస్ కొట్టగా అదే మంత్రాన్ని ఫాలో అవుతున్నాయి రాబోయే సినిమాలు కూడా. రెగ్యులర్ విలన్స్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చేస్తే జనాలకు బోర్ కొడుతుందేమో అని ఫేడ్ అవుట్ అయిపోయిన నటీనటులను, రిటైర్మెంట్ ఇచ్చిన నటీనటులను, ఇతర భాషల నుంచి నటీనటులను ఇక్కడ దించుతున్నారు.

అలా తెలుగులో వరుస సినిమాల అవకాశాలు కొట్టేస్తున్నాడు మాధవన్. ప్రస్తుతం ఏ సినిమా లో విలన్ పాత్ర కి అవకాశం వచ్చిన ఆయన పేరే వినబడుతుంది. సెలెక్ట్ అవుతారు లేదో తెలియదు గాని ఆయన పేరును మాత్రం మొదట పరిశీలిస్తున్నారు మేకర్స్. సవ్యసాచి, నిశ్శబ్దం చిత్రాలతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన మాధవన్ ఈ సినిమాల తర్వాత చాలా తెలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయట.

ఇప్పటికే రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో విలన్ గా మాధవన్ ని అనుకుంటున్నా రు అని వార్త లు వస్తుండగా మహేష్ బాబు సర్కా ర్ వారీ పాట సినిమాలో కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా ఆయన ప్రధాన పాత్రలో నటింప చేయాలని కొంతమంది కథలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారట. మొత్తానికి ముదురు వయసులో ఉన్న ఈ హీరో వెంట మన టాలీవుడ్ మేకర్స్ పడటం కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నటనా పరంగా ఆయన ప్రేక్షకులను అలరించడం తో పాటు కూడా మేకర్స్ నీ కూడా ఎంతగానో సంతృప్తి పరుస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: