మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు వెళ్లి సినిమాలకు చాలా సంవత్సరాల పాటు దూరంగా ఉన్నారు, ఆ తర్వాత సినిమాలలో నటించాలి అనే ఆసక్తితో ఖైదీ నెంబర్ 150 మూవీ తో తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అదే జోష్ లో సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి, అదే రేంజ్ లో విడుదల చేసి యంగ్ హీరోలకు నేనుమి తక్కువ కాదు అనిపించుకున్నాడు. అయితే ఇలా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోగా నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి  చేస్తున్న చిరంజీవి, ఈ సినిమా తో పాటు మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది, గాడ్ ఫాదర్ మలయాళ వెర్షన్ లూసీఫర్ లో చెల్లెలు పాత్ర ను మంజు వారియర్ చేసింది, అయితే తెలుగులో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం నయనతార తో సంప్రదింపులు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నయనతారను ఈ సినిమాలో భాగం చేయడానికి చిత్రబృందం తెగ ప్రయత్నాలు చేసినప్పటికీ, నయనతార ఒప్పుకోలేదని ఫిలిం సర్కిల్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఇప్పటికిప్పుడే ఈ పాత్ర కోసం ఒక నాటిని సెట్ చేయడం కష్టం అని భావించిన ఈ చిత్ర బృందం ఆ పాత్రను ఈ సినిమా నుండి తీసివేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ట్రాక్ మొత్తాన్ని తిరిగి రాశారని రూమర్స్ కూడా వస్తున్నాయి. అలాగే చెల్లెలు సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలను పక్కనపెట్టి మిగతా షూటింగ్ ను నిర్వహించాలని చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు, ఆ తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు అని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: