చిత్ర పరిశ్రమలో కొన్ని కొన్ని సార్లు దర్శకులైన, నిర్మాతలైన ఎవరైనా సరే సెలబ్రిటీలను అవమానించినట్లు వారికీ తగిన రీతిలో సమాధానం ఇస్తుంటారు. ఇక ఎంతో మంది హీరోయిన్లు దర్శకనిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలను ఎన్నోసార్లు చూసిందే. అయితే కొంతమంది సెలబ్రిటీల మాత్రం పెద్ద వాళ్ళు తిట్టారని, ఇంకొకసారి వాళ్లకు తమ ముఖాలను చూపించకుండా దొంగచాటుగా తిరుగుతుంటారు. అంతేకాదు.. తాజాగా ఒక డైరెక్టర్ ను బండ బూతులు తిట్టిందట ఒక నటి .. అందుకు గల కారణం ఏంటో ఒక్కసారి చూద్దామా.

అయితే ఆ డైరెక్టర్ ని తిట్టిన నటి ఎవరో కాదు.. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించి గుర్తింపు తెచ్చుకున్న రాణి అలియాస్ రక్ష. ఆమె నచ్చావులే సినిమాలో తనిష్క్ తల్లి పాత్రలో నటించారు. అంతేకాదు.. ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రక్ష మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా రాణించారు.

ఇక రక్ష పంచదార చిలక, అడవి చుక్క, పవిత్ర ప్రేమ వంటి పలు సినిమాలలో దాదాపు 30కి పైగా సినిమాలలో నటించారు. ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఈ భామ. ఇండస్ట్రీకి తల్లి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈమె కొన్ని ఏళ్ళ కిందట డైరెక్టర్ ను చెంప పగలకొట్టిందట.

కాగా.. ఒకసారి బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న రవన్న సినిమా షూటింగ్ సమయంలో తను చెన్నై నుంచి హైదరాబాద్ కు విమానంలో వస్తుంటే, పక్కన ఓ పెద్దాయన కూర్చొని తనపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలియజేసింది. అయితే తనకు కోపం రావడంతో ఈ వయసులో ఇదేం పనిరా అంటూ అక్కడే అతడి చెంప పగలగొట్టానని వెల్లడించింది. అంతేకాక.. తమిళ దర్శకుడు తనకు కథ చెప్పినప్పుడు పెళ్లయిందని, గ్లామర్ పాత్రలు చేయనని క్లియర్ గా చెప్పారంట.

మరింత సమాచారం తెలుసుకోండి: