మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా నటించిన సినిమా వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా డివివి దానయ్య నిర్మించారు . అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా చరణ్ నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం.

మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు కలిగిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలానే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది. ఇక మరొకవైపు చిరంజీవి తో కలిసి ఆచార్య తో పాటు అటు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నారు రామ్ చరణ్ . కాగా వాటిలో ఇటీవల ఆచార్య లో తన పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేసిన చరణ్, శంకర్ మూవీ షూటింగ్ ని ప్రస్తుతం శరవేగంగా చేస్తున్నారు. మరొకసారి కియారా ఈ సినిమాలో చరణ్ కి జోడీగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత హీరోగా రామ్ చరణ్ రేంజ్, పాపులారిటీ తో పాటు మార్కెట్ రేంజ్ కూడా విపరీతంగా పెరగడం ఖాయం అని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కనుక భారీ సక్సెస్ అందుకుంటే ఆ తరువాత ఆచార్య, శంకర్ సినిమాల పై మంచి అంచనాలు ఏర్పడుతాయని, ఇక అవి కూడా భారీ సక్సెస్ కొడితే రామ్ చరణ్ హీరోగా ఎవరికీ అందరాని అంటున్నారు. మరి రాబోయే తన తదుపరి సినిమాలతో రామ్ చరణ్ ఎంతమేర సక్సెస్ లు సొంతం చేసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: