కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈయన మరణం అటు కుటుంబ సభ్యులకు ఇటు తన వీరాభిమానులకు ఇంకా కన్నడ సినీ పరిశ్రమకు ఎప్పటికీ తీరని లోటు. ఆయన ఇక మనకు కనిపించరు మన ముందు లేరు అనే విషయాన్ని తన ఇద్దరు పిల్లలు తన భార్య అందరూ జీర్ణించుకోలేకపోయారు. కాగా అతను మనందరి కళ్ళముందు లేకపోయినా మనందరిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని పునీత్ రాజ్ కుమార్ ఆర్ బయోపిక్ ను మన అందరి ముందుకు తేవాలని కొందరు భావిస్తున్నట్లు  ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయట.

 సంతోష్ దర్శకత్వం వహించిన పునీత్ చాలా సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో దర్శకుడు సంతోష్ను ఉద్దేశిస్తూ.. పునీత్ అభిమాని ట్విట్టర్ వేదికగా తన మనసులోని మాటని అందరికీ తెలియజేశారు. తన మనసులోని మాట చెప్పిన వ్యక్తి దర్శకుడు సంతోష్ నీ టాగ్ చేసి సార్ అప్పు సార్ బయోపిక్ ని మా అందరి ముందుకు తెండి ప్లీజ్ సార్.... ఆయన గురించి అన్నీ తెలిసిన వ్యక్తి మీరు మీకంటే బాగా ఆయన గురించి ఎవరికీ తెలీదు అంత గొప్ప వ్యక్తి గురించి మీ కన్నా గొప్పగా ఎవరు తీయలేరు మీరు తప్పకుండా తీయాలి సార్ అని కోరాడు. అయితే ఆయన చేసిన ట్వీట్ కు స్పందించిన దర్శకుడు సంతోష్ తప్పకుండా మీ అందరి కోరికను నెరవేర్చే పనిలో ఉంటాను అని సమాధానమిచ్చాడు.

 ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. కాగా పునీత్ ఇటీవల  'రాజా కుమార', 'యువరత్న' సినిమాల్లో నటించారు ఈ రెండు సినిమాలకు సంతోష్ దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ లను అందుకున్నాయి. అయితే పునీత్ నటించిన యువరత్న సినిమా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సంతోష్ పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ను తీసి ప్రేక్షకుల ముందుకు తెస్తే వారికి అది ఒక పెద్ద బహుమతిగా నిలిచిపోతుందని అందరూ భావిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: