నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన 'అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు. అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్ నెగెటివ్ పాత్రలో కనిపించగా, పూర్ణ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు. బాలయ్య నటించిన అఖండ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో మంచి స్పందన వచ్చింది.

అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా ఆరంభం నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంటూ వచ్చింది. ఏపీలో టికెట్ ధరల సమస్య ఉన్నా దీనికి మంచి కలెక్షన్లే అందుకుంది. గతంలో బోయపాటి శ్రీను, బాలయ్య కంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం అఖండ. ఈ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇక అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు నాలుగు వారాలు అవుతున్నా రెస్పాన్స్ మాత్రం మంచిగానే అందుకుంటుంది. ఈ తరుణంలోనే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌ డేట్ బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ సినిమా ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆనందించారు. ఈ సినిమా  కొద్ది రోజుల్లోనే ఇది ఓటీటీలోకి కూడా రాబోతుందని సమాచారం. ఈ మూవీని ఫిబ్రవరి 27న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: