ఒకప్పుడు హీరోయిన్ గా తన సత్తా చాటి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది శృతిహాసన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆ తర్వాత మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో సినిమాలకు దూరంగా వెళ్ళింది. కానీ అక్కడ కలిసి రాకపోవడంతో మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలాంటి సమయంలోనే రవితేజతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది శృతిహాసన్.


 ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. దీంతో శృతి హాసన్ మళ్లీ ట్రాక్ లో పడినట్లుగా అయింది. ఇక వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చి ఈ అమ్మడి ముంగిట వాలాయ్. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించేందుకు సలార్ సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా శృతి హాసన్ ఛాన్స్ కొట్టేసింది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.


 చలో, భీష్మ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. ఈ యంగ్ దర్శకుడితో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమాకు నిర్మాతగా డి.వి.వి.దానయ్య వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో శ్రుతిహాసన్ చిరంజీవి సరసన చాన్స్ కొట్టేసింది అంటూ టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మాత్రం హీరోయిన్ చేంజ్ అయింది అంటూ మరో వార్త హల్చల్ చేస్తోంది. శృతిహాసన్ కాదు చిరు సినిమాలో అనుష్క శెట్టి ఆడి పాడ పోతుంది  అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.. ఇలా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో చిరు సరసన సీనియర్ హీరోయిన్ అనుష్క కన్ఫామ్ అయ్యింది అని టాక్. మరి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: