నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే పోయిన సంవత్సరం విడుదలైన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా విడుదలై 50 రోజుల దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటికీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, విలన్ పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ నటించబోతున్నాడు, అలాగే మరొక ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కనిపించబోతోంది.

 అయితే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించబోతున్నట్లు, మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, బాలకృష్ణ ఒక పాత్రలో యంగ్ గా కనిపిస్తారని మరో పాత్రలో వృద్ధుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుంది అని తెలుస్తోంది, అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ 60 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఇక ఒక రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించాలని అనుకున్న పారిశ్రామికవేత్తలు కొన్ని కారణాల వల్ల ఆ విషయంలో వెనక్కు తగ్గుతూ ఉంటారు, ఆ సమస్యలను పరిష్కరించి బాలకృష్ణ ప్రజలకు పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా మేలు చేశాడు అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుంది, ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెకించబోతునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: