అఖండ
సినిమా తర్వాత
బాలకృష్ణ కు
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భారీ స్థాయిలో ఇమేజ్ వచ్చిన సంగతి పక్కన పెడితే ఆయనకు భారీగా డిమాండ్ పెరిగి పోయిందని చెప్పుకోవాలి. ఆయనతో సినిమాలు చేసే విధంగా చాలామంది దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే మంచి దర్శకులను లైన్ లో పెట్టుకున్న
బాలకృష్ణ ఇప్పుడు మరి కొంత మంది దర్శకులతో చర్చలు చేస్తూ ఉండటం నందమూరి
బాలకృష్ణ అభిమానులు ఎంతో సంతోష పెడుతుంది.
అఖండ సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అమోఘంగా నటించి
బాలకృష్ణ నటనలో తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ
హీరో మరికొన్ని మంచి పాత్రలలో నటించే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. అలా బ్యాక్ టు బ్యాక్
మాస్ మసాలా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మరొకసారి ఈ సినిమాతో అలరించనున్నాడు బాలయ్య.
అయితే ఈ చిత్రం తర్వాత ఆయన
అనిల్ రావిపూడి పూరి జగన్నాథ్
శ్రీవాస్ వంటి దర్శకులతో సినిమాలు చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరి తో ముందుకు వెళుతున్నాడు అనే విషయంపై ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఈ దర్శకుల సినిమాల్లో చేసే విధంగా ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడ ట బాలకృష్ణ. తాజాగా బాలకృష్ణకు
సినిమా చేయాలనే దర్శకుల లిస్టులో మరొక దర్శకుడి పేరు కూడా యాడ్ అయ్యింది. ఆయన
శ్రీకాంత్ అడ్డాల. ఇటీవలే
వెంకటేష్ హీరోగా నటించిన
నారప్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు
బాలకృష్ణ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడట త్వరలోనే ఈ కథను బాలకృష్ణకు వినిపించబోతున్నాడట.