ప్రస్తుతం తెలుగు హీరోలు భారీ యాక్షన్ ఉన్న సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఫ్యాన్స్ కు రియాలిటీ చూపించాలని అనుకుంటున్నారు. అందుకే స్వయంగా మేమే యాక్షన్ సీన్లలో కనిపిస్తాము అంటున్నారు. ముఖ్యంగా నాగర్జున లాంటి స్టార్ హీరోలు సైతం కుర్ర హీరోల తో పోటీ పడుతున్నారు.. భారీ యాక్షన్ ఉన్న కథలను ఎంచుకోవడం వల్ల షూటింగ్ లలో గాయాలు అవుథున్నాయి.ఇప్పటికే చాలా మంది హీరోలకు షూటింగ్ సమయంలో గాయాలు అయ్యాయి..కొద్ది రోజులు షూటింగ్ కు గ్యాప్ తీసుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారు. చిన్న చిన్న ప్రమాదాలు జరగడం వలన ఊపిరి పీల్చుకున్నారు.



ఇప్పుడు మరో స్టార్ హీరో గోపిచంద్ కు గాయాలు అయ్యాయి.ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో హీరో గోపీచంద్ 30వ చిత్రం తెరకెక్కుతుంది. మైసూర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో పోరపాటున కాలు జారి కింద పడ్డాడు..కొంత ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి మరేమీ ప్రమాదం లేదని అంటున్నారు.ఈ మేరకు చిత్ర యూనిట్ తెలియజేశారు. భగవంతుడు దయతో ప్రమాదంలో గోపీచంద్ కి ఎటువంటి గాయాలు కాలేదు..



అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడవద్దని మేకర్స్ అంటున్నారు. ముందు చాలా సార్లు షూటింగ్ సమయం లో కింద పడిపోయాడు.2019లో విడుదలైన చాణక్య మూవీ షూటింగ్ సమయంలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక 2007లో విడుదలైన లక్ష్యం సూపర్ హిట్ కాగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ టైటిల్ తో మూవీ తెరకెక్కుతుండగా, ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక విజయాల పరంగా వెనుకబడిన గోపీచంద్ తన అప్ కమింగ్ చిత్రాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు.సింగం' సిరీస్‌ను తెరకెక్కించిన తమిళ దర్శకుడు హరి గోపిచంద్‌తో ఓ భారీ యాక్షన్ సినిమాను చేయాలని భావిస్తున్నాడట.ఆ సినిమా పై అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం వల్ల షూటింగ్ కు కొంత బ్రేక్ తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందని మేకర్స్ ఆలోచనలొ పడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి: