వరుసగా నాలుగు సినిమాలతో బాక్సాఫిస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న
కొరటాల శివ ఐదవ సినిమాగా చేసిన ఆచార్య సినిమాతో భారీ స్థాయిలో
సక్సెస్ అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. ఈ
సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా అభిమానులలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది ఆచార్య సినిమా. ఈ చిత్రం ఊహించనివిధంగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
ఫ్లాప్
సినిమా గా ఇది మారడం మెగా అభిమానులు సహించలేకపోయారు. తండ్రి కొడుకులు చరణ్ మరియు
చిరంజీవి ఇద్దరు కలిసి నటించిన ఈ
సినిమా ద్వారా వారు భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకోవాలని ఇప్పుడు ఆ
సినిమా యొక్క ప్లాప్ భారం తో
ఎన్టీఆర్ 30వ
సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు దర్శకుడు
కొరటాల శివ. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
ఈ
సినిమా కోసం
కొరటాల శివ తన పాత పద్ధతి లో కాకుండా కొత్త ఫార్మాట్ లో
సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఎలాంటి మెసేజ్ లు లేకుండా పక్కా కమర్షియల్
మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు అని తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఆయన ప్రతి సినిమాలో కూడా మెసేజ్ తప్పనిసరిగా ఉంటుంది. అలా
ఎన్టీఆర్ 30వ
సినిమా లో కేవలం కమర్షియల్ అంశాలను హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఎన్టీఆర్ పాత్ర కూడా హై ఓల్టేజ్ లో ఉంటుందట. మరి ఈ
సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ చిత్రంతో ఏ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి. పాన్
ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటు
ఎన్టీఆర్ కు కూడా ఎంతో ముఖ్యమైన సినిమా. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ ఏ స్థాయిలో
సక్సెస్ వస్తుందో చూడాలి.