టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన ఆశ్చర్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ అనే చిత్రానికి ఇది రీమేక్ గా రూపొందుతోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా రిలీజ్ పై లీక్ ఇవ్వడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మరో టాక్ పెద్దఎత్తున వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు అంటే కచ్చితంగా ఈ సినిమాపై హిందీలో కూడా మంచి అంచనాలు ఉంటాయి. మెగాస్టార్ కోసం కాకపోయినా తన కోసమైనా ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. అందుకే ఈ సినిమాకి హిందీ వెర్షన్ కి మాత్రం థియేట్రికల్ రైట్స్ తోపాటు డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు కలిపి ఏకంగా 42 కోట్ల భారీ డీల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.

అయితే ఇంత భారీ మొత్తంలో అక్కడ ఈ సినిమా రైట్స్ ని ఎవరు కొనుగోలు చేశారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మెగాస్టార్ సినిమాకి హిందీలో ఈ రేంజ్ లో డీల్ కుదిరడం అంటే అది మామూలు విషయం కాదు. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఈ సినిమాలో నయనతార టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే విడుదల తేదీ పై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు మెగాస్టార్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: