దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరైన శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఈ దర్శకుడు పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని దర్శకుడిగా తానేంటో అనేక సార్లు నిరూపించుకున్నాడు . అలాంటి ఈ దర్శకుడు రోబో సినిమా తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన రోబో మూవీ రేంజ్ విజయాన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోయాడు .  

ఆఖరుగా శంకర్ 'రోబో 2.O'  సినిమాకు దర్శకత్వం వహించాడు . రోబో సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో రోబో 2.O మూవీ పై ప్రేక్షకులు అనేక అంచనాలు పెట్టుకున్నారు . కాకపోతే ఈ సినిమా రోబో రేంజ్ విజయాన్ని మాత్రం సాధించలేదు . ఇలా రోబో 2.O మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినా శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాను కూడా శంకర్ తన గత మూవీ లాగానే భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా ప్రస్తుతం 8 వ షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది . ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన టాక్ బయటకు వచ్చింది.

8 వ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా, ఈ షెడ్యూల్ లో ఒక భారీ యాక్షన్ పని వేశాన్ని చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: