మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కొంత కాలం క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు . 

అలా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమా రామ్ చరణ్ కి కెరియర్ పరంగా 15 వ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ సి 15 అనే పేరుతో జరుపుకుంటోంది.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే . ఇప్పటికే కొన్ని షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం కూడా అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ లోని విక్టోరియా మెమోరియల్‌ హాల్‌ లో ఈ మూవీ  చిత్రీకరణ జరుగుతోంది.

సికింద్రాబాద్‌ లోని విక్టోరియా మెమోరియల్‌ హాల్‌ లో  ఎన్నికల ఓట్ల లెక్కింపు సన్నివేశాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు కీలక తారాగణం పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: