టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు . సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే వంద కోట్ల కు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందు కోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ఇమేజ్ ను వైష్ణవ్ తేజ్ సొంతం చేసుకున్నాడు . ఇది ఇలా ఉంటే పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు . 

మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా రంగ రంగ వైభవంగా మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది . ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ను విడుదల చేసింది . రంగ రంగ వైభవంగా మూవీ ట్రైలర్ ను ఆగస్ట్ 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ చిత్ర బృందం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఈ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: