టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు ఆయన విజయ్ దేవరకొండ తాజాగా బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన లైగర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా అనన్య పాండేమూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది . భారీ అంచనాల నడుమ ఆగస్టు 25 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన లైగర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత హీరోయిన్ గా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కు తున్న ఖుషి మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. లైగర్ మరియు ఖుషి మూవీ లు సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జన గణ మన అనే మూవీబ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: