ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మణిరత్నం టేకింగ్, విజువల్స్ను ఎప్పుడెప్పుడు తెరపై చూద్ధామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ క్యూరియాసిటీని పెంచుతున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు విక్రమ్, రవి భారీగా ప్రచారం చేస్తున్నారు
ప్రమోషన్లో భాగంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ డేట్ గురించి వెల్లడించారు. మొదటి భాగం విడుదలైన ఆరు నుండి తొమ్మిది నెలలోపే సెకండ్ పార్ట్ను విడుదల చేస్తామని చెప్పాడు సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది అని మణిరత్నం పేర్కొన్నారు . దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పొన్నియన్ సెల్వన్ పార్ట్-2ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ రెండు పార్ట్లకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.125 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర మొదటి భాగంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించారు. స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు, భారీ అంచనాల తో మణి రత్నం చిత్రం నిర్మిస్తున్నారు.