ఇటీవల రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ, షార్ట్ గ్యాప్ తరువాత మరో సినిమా చేస్తున్నాడు. రూలర్ సినిమా డిజాస్టర్ కావటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్లు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. అయితే ప్రస్తుతం బోయపాటి కెరీర్ కూడా అంత ఆశాజనకంగా లేదు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ కూడా అభిమానులను నిరాశపరిచింది. దీంతో బాలయ్యతో బోయపాటి చేసే విషయంలో కూడా అనుమానాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (సోమ వారం) ప్రారంభమైంది. అయితే ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని భావిస్తున్న బాలయ్య, బోయపాటి ఈ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఓ సీనియర్ హీరోను ఈ సినిమాలో బాలయ్యకు ప్రతినాయకుడిగా సెలెక్ట్ చేశారట. గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమాతో జగపతిబాబును విలన్గా పరిచయం చేశాడు బోయపాటి. ఆ సినిమాతో జగపతి బాబు రేంజే మారిపోయింది.
ఇప్పుడు కొత్త సినిమా కోసం మరో సీనియర్ హీరో రాజశేఖర్ను విలన్గా మార్చేస్తున్నాడట బోయపాటి. ముందుగా ఈ సినిమాలో విలన్ పాత్రకు శ్రీకాంత్ను సంప్రదించినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే శ్రీకాంత్ చేయనన్నాడో లేక చిత్రయూనిటే మనసు మార్చుకున్నారో తెలియదుగాని ఇప్పుడు ఆ స్థానంలో శ్రీకాంత్ కు బదులు రాజశేఖర్ ను తీసుకున్నారట. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నయనతార నటించనుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.