తెలుగు ఇండస్ట్రీలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అందాల భామ శృతిహాసన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కి కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస ఛాన్సులు కొట్టేస్తూ వచ్చింది. అయితే ఈ మద్య శృతిహాసన్ కి తెలుగు లో పెద్దగా ఛాన్సులు రావడం లేదు.. అని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఫామ్ లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.
గతంలో బలుపు చిత్రంలో రవితేజ సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన బలుపు చిత్రంలో నటించిన శృతి హాసన్ మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. క్రాక్ చిత్రంలో రవితేజ సరసన మరోసారి నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ సరసన మరోసారి కనిపించబోతుందట శృతి హాసన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ మద్య డాలీ దర్శకత్వంలో కాటమరాయుడులో ఈ జంట కలిసి నటించిన విషయం తెలిసిందే.
హరీష్ శంకర్ తీయబోయే ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించనుందనేది సమాచారం. శృతిహాసన్ గతంలో పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వేణు శ్రీరామ్, క్రిష్ చిత్రాల్లో ఒకటి పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది. గతంలో వచ్చిన కాటమరాయుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒకవేళ ఈ జోడీ మరోసారి నటిస్తే ఎంత వరకు హిట్ అందుకుంటారో చూడాలి.