చిరంజీవి సైరా న‌ర్సింహారెడ్డి చిత్రం త‌ర్వాత కొర‌టాల శివ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. చిరు న‌టించ‌బోయే ఈ 152వ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ పెట్ట‌నున్న‌ట్లు ఇటీవ‌లె జ‌రిగిన ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్ లో చిరంజీవి తెలిపారు. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మ‌రో కీల‌క లెంగ్తీ పాత్ర ఒక‌టి ఉంది దానికి ఎవ‌రిని తీసుకోవాలా అనే ఆలోచ‌న‌లో స‌త‌మ‌త‌మ‌వు తున్నారు కొర‌టాల‌.

 

మ‌రి ఆ పాత్ర కోసం మొద‌ట రాంచ‌ర‌ణ్‌ను సంప్ర‌దించ‌గా స‌రే అన్నారు. కానీ రామ్‌చ‌ర‌ణ్ రాజ‌మౌళి ఆర్.ఆర్‌.ఆర్ చిత్రంతో ఫుల్ బిజీగా ఉండ‌డంతో  రాజ‌మౌళి ఆ చిత్రానికి చేయ‌డానికి ఒప్పుకోలేదు. మ‌ళ్ళీ కొర‌టాల అడ‌గ‌డంతో స‌రేన‌న్నార‌ని ఇలాంటి వార్త‌లు ఎన్నో వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఈ పాత్ర కోసం మ‌హేష్‌ని అడిగార‌ని తెలిసింది. అయితే మ‌హేష్ ఏమ‌న్నారో మ‌రి ఇంకా తెలియ‌లేదు. అయితే ఈ గుస‌గుస‌ల‌న్నీ ప‌క్క‌న పెడితే ... ఈ పాత్ర కోసం లెటెస్ట్‌గా వచ్చిన వార్త ఏమిటంటే నంద‌మూరి హీరో  ఎన్టీఆర్ ని సంప్ర‌దించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే మ‌హేష్‌తోపాటు ఎన్టీఆర్‌కూడా వ‌చ్చి జాయిన్ అవుతాడా... లేక మ‌హేష్ ను తోసేసి ఎన్టీఆర్ జాయిన్ అవుతాడా అన్న విష‌యంలో క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

 

అయితే ఎన్టీఆర్ కూడా ఆర్‌.ఆర్‌.ఆర్ బిజీలోనే ఉన్నారు. కానీ రామ్‌చ‌ర‌ణ్‌కంటే ముందుగానే ఎన్టీఆర్ షూట్ పూర్త‌వుత‌ద‌ట దీంతో ఈ చిత్ర టీమ్ ఎన్టీఆర్‌ని సంప్ర‌దించ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రి చివ‌రికి ఎవ‌రిని ఓకే చేస్తారు అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ విష‌యం పై ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. దానికోసం ఈ హోళీ లేదా ఉగాదికి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. మ‌రి చివ‌రికి ఏ కాంబినేష‌న్ ఓకే అవుత‌దా అని ఫ్యాన్స్‌లో రోజురోజుకు దీని పై ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇక ఇదిలా ఉంటే చిరు, ఎన్టీఆర్ అన్న‌ది చాలా రేర్ కాంబినేష‌న్ ఆ కాంబినేష‌న్ గ‌నుక తెర‌మీద క‌నిపిస్తే ఇక బొమ్మ ద‌ద్ద‌రిల్లాల్సిందే అని కొంత మంది ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. మ‌రొ కొర‌టాల చివ‌రికి ఎవ‌ర్ని ఫైన‌ల్ చేస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: