తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో పాతుకుపోయి దర్శక నిర్మాతలు అందరిని ఆకర్షించి... వరుస అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగితే..  కొంతమంది రెండు మూడు సినిమాలతోనే చిత్ర పరిశ్రమ ను ఒక ఊపు ఊపి ఆ తర్వాత కనుమరుగు అయిపోతుంటారు. రెండు మూడు సినిమాలతో ఎంతో క్రేజ్ సంపాదించి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు శ్వేతా బసు. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఇక కొత్త బంగారులోకం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుణ్ సందేశ్ హీరోగా శ్వేతాబసుప్రసాద్ హీరోయిన్ గా  తెరకెక్కిన ఈ చిత్రం ఎంతగానో ఆకర్షించింది. కాలేజీ ప్రేమకథలు ఎలా ఉంటాయి అనేది కొత్త బంగారులోకం సినిమాలో దర్శకుడు కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇక ఈ సినిమా యూత్ ని బాగా ఆకర్షించడంతో ఓ సంచలన విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా. శ్వేతా బసు ప్రసాద్ కి ఎంతగానో గుర్తింపు వచ్చింది. 

 

 

 శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా పరిచయమైన మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి యూత్ లో శ్వేతా బసు కి మంచి క్రేజ్ రావడం తో ఆ రోజుల్లో శ్వేతాబసు ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదు. కొత్త బంగారులోకం సినిమా తర్వాత కనీసం ఆ స్థాయి సినిమా కూడా ఈ అమ్మడు చేయించుకోలేక పోయింది. ఏదో అడపాదడపా చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అవి కూడా సరిగా ఆడకపోవడంతో పూర్తిగా కనుమరుగై పోయింది శ్వేతా బసు ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: