తెలుగు చిత్ర పరిశ్రమలో మన నటులు ఒక్కవైపు నటిస్తూనే మరోవైపు వేరే బిజినెస్ చేస్తున్నారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే జాబితాలో చేరనున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ సొంతంగా టీవి ఛానెల్ పెట్టబోతున్నారని న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ గా హల్ చల్ చేస్తుంది.

 

 

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ‘యువ’ అనే ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తూ, దాని రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తుందని సమాచారం. మొత్తానికి ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకు ఆసక్తికరంగా అనిపించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

 

 

ఎన్టీఆర్ మామగారైన నార్నె శ్రీనివాస రావుకి ఇప్పటికే ఒక టీవీ ఛానల్ ఉందని అందరికి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఆ ఛానెల్ కు అనుసంధానంగా తన  కొత్త ఛానెల్ ప్రారంభించబోతున్నాడని తెలిపారు. అయితే టెక్నికల్, స్టాఫ్ వంటి విషయాలన్ని నార్నె శ్రీనివాసరావు చూసుకోబోతున్నారట్లు సమాచారం.

 

 

 అయితే ఎన్టీఆర్ పెద్దగా ఇన్వాల్వ్ కాడని, తన కెరీర్ నుంచి దృష్టి ప్రక్కకు పెట్టేది లేదని క్లియర్ గా చెప్పారట. ఫైనాన్సియల్ గా అవసరమైతే మనీ ఎడ్జెస్ట్ చేయటం తప్ప మిగతావి పట్టించుకోదలుచుకోలేదుట. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఛానెల్ ఉపకరిస్తుందని కొందరు ఇప్పటినుంచే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 

 

 

ప్రస్తుతం ఎన్టీఆర్ తన తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా కనిపించనున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం తరువాత, అతను తన తదుపరి ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జతకట్టనున్నారు.

 

 

త్రివిక్రమ్ చిత్రం తర్వాత కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ లాక్ డౌన్ బ్రేక్ కారణంగా ఎన్టీఆర్ కూడా కథా చర్చలు జరుపుతున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: