టాలీవుడ్ లో  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. ఎందుకంటే ఈయన సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక వైపు క్లాస్ గా కనిపిస్తారు కానీ, మరో వైపు మాస్ కోణాన్ని కూడా తన సినిమాల్లో చూపిస్తుంటారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈయన అగ్ర హీరోలతోనే సినిమాలు తెరకెక్కించి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.అయితే ఇటీవల  పవన్ అజ్ఞాత వాసి లాంటి భారీ ఫ్లాప్ సినిమా తర్వాత త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత మంచి హిట్ ని ఇచ్చింది.ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా టాప్ మోస్ట్ హిట్ గా నిలిచింది.. దాంతో త్రివిక్రమ్ తిరిగి తన పూర్వ వైభంగా కొనితెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటించేశారు.

కానీ త్రివిక్రమ్ స్పీడుకు కరోనా వైరస్ బ్రేకులేసింది. ఎందుకంటే.. యంగ్ టైగర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే కానీ.. మరో సినిమాను ఎన్టీఆర్ మొదలుపెట్టడానికి వీలులేదు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది.పూర్తి కావడానికి సమయం పట్టేలానే ఉంది.మరోవైపు జనవరి నుండి గురూజీ ఖాళీగానే ఉంటున్నారు. ఇంకా వెయిటింగ్‌లో ఉండాల్సిన పరిస్థితి అందుకనే త్రివిక్రమ్ ఓ ప్లాన్ చేశాడట. గ్యాప్‌లో సినిమాను త్వరగా పూర్తి చేసెయాలని అనుకుంటున్నాడట.

 ఈ కోవలో త్రివిక్రమ్ హీరో రామ్‌తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు, త్రివిక్రమ్ స్క్రిప్ట్‌కు పైనల్ టచ్ ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలోపు సినిమాను పూర్తి చేసి విడుదల చేసేలా ప్లాన్స్ చేస్తున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది.ఇటు ఎన్టీఆర్ rrr షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే లోపు.. రామ్ తో సినిమా ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి.. తన గ్యాప్ ను ఫిల్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి దీనికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా?లేదా?అనేది తెలియాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: