ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా ని కాదని ఇటీవలే అనౌన్స్ చేసిన అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ ని చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల దర్శకుడు సాగర్.కె.చంద్ర రూపొందించనున్నాడు.ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా ఈ మధ్య గట్టి ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ సినిమా కి త్రివిక్రమ్ డైలాగ్స్ రాయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తే కొంచెం క్రేజ్ వస్తుంది కానీ మలయాళం ఒరిజినల్ చూసిన వారికి దీనికి త్రివిక్రమ్ అవసరం దేనికనిపిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రం కథ, పాత్రలు ప్రధానంగా సాగిపోతుంది. దానికంటూ ప్రత్యేక సంభాషణలు అవసరం లేదు.మలయాళంలో వున్న డైలాగులను తర్జుమా చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. దానికి త్రివిక్రమ్ ప్రాస కానీ, ఆయనకున్న పరిజ్ఞానం కానీ అవసరం లేదు. త్రివిక్రమ్ లాంటి రైటర్ను పెట్టుకుంటే సంభాషణల పరంగా తన ముద్ర చాటుకోవాలని లేనిపోని డైలాగులు రాసే ప్రమాదం కూడా లేకపోలేదు.ఇక ఈ సినిమా తర్వాత పవన్ మూడు సినిమాలు ఒప్పుకున్న సంగతి అందరికి తెలిసిందే.. క్రిష్ దర్శకత్వంలో ఒకటి కాగా , హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరొకటి.. సురేందర్ రెడ్డి దర్సకత్వంలో రాబోయే సినిమా చర్చల దశలో ఉంది..