టాలీవుడ్ సినిమా పరిశ్రమకి యువ నటుడు రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అనంతరం పెద్ద సిక్స్ అందుకుని హీరోయిన్ గా కీర్తి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని అనంతరం నాని సరసన నేను లోకల్ సినిమా లో నటించి దానితో కూడా మరొక సక్సెస్ అందుకున్న కీర్తి, ఆపై ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసిలో ఒక హీరోయిన్ గా నటించింది.

అయితే ఆ సినిమా మాత్రం ఊహించనివిధంగా ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక ఆపై నాగ అశ్విన్ దర్శకత్వంలో దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు గొప్ప సక్సెస్ అందుకుని జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకుంది కీర్తి. ఇటీవల పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్, అతి త్వరలో తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట మూవీలో నటించనుంది. ఇక గత సినిమాల కోసం బాగా స్లిమ్ గా తయారైన కీర్తి, అతి త్వరలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట కోసం ప్రస్తుతం ఫుల్ గా ఫుడ్ లాగించే పనిలో ఉందట. వీలైనంతగా అన్ని తింటూ బొద్దుగా తయారయెందుకు సిద్ధం అవుతోందట.

కాగా ఆ సినిమాలో ఆమె పాత్రకు గాను కొంత బొద్దుగా ఉంటేనే బాగుంటుందని దర్శకడు పరశురామ్ చేసిన సూచన మేరకు కీర్తి ప్రస్తుతం ఆ పనిలో ఉందని అంటున్నారు. జనవరి మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా, బ్యాంక్ మోసాలు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: