అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాలో అఖిల్ తో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమాలో సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ మూవీని కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 1న సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఇండియాలో కాకుండా ఫారిన్ లో కూడా ఈ సినిమా షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది.

అఖిల్ నుండి మిస్టర్ మజ్ను వరకు చేసిన మూడు సినిమాలు రిజల్ట్ తేడా కొట్టడంతో బ్యాచ్ లర్ సినిమాను చాలా జాగ్రత్తగా చేశాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ మీద పూర్తి నమ్మకంతో ఈ సినిమా చేసినట్టు తెలుస్తుంది. అయితే సినిమా రష్, సినిమాకు వస్తున్న బజ్ బ్యాచ్ లర్ అఖిల్ కు మొదటి కమర్షియల్ హిట్ అందించేలా ఉందని అంటున్నారు. అఖిల్ 5వ సినిమా కూడా ఫిబ్రవరిలో మొదలు పెట్టి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అఖిల్ కెరియర్ సెట్ చేసే పనిలో ఉన్న నాగార్జున ఎలాగైనా అఖిల్ కు ఓ మంచి కమర్షియల్ హిట్ ఇచ్చే డైరక్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాచ్ లర్ తర్వాత మరికొన్ని సినిమాలకు ఓకే చెబుతాడని టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: