మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ పేరు టాలీవుడ్ లో మారుమోగుతుంది. డెబ్యూ సినిమా అంటే ఎవరైనా మాస్...లవ్ రొమాంటిక్ యాంగిల్ లో కమర్షియల్ సినిమాలతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం మొదటి సినిమానే ప్రయోగాత్మక చిత్రం లో నటించి రిక్స్ చేసాడు. అంతే కాకుండా సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాల కు భయపడి బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు నో చెప్పడం సహజం కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం ఎంతో రిస్క్ చేసి ఈ పాత్రను చేశారు. ఆ రిస్కె ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కు మంచి విజయం అందించిందని చెప్పవచ్చు. ఇక ఉప్పెన విజయం తో వైష్ణవ్ తేజ్ కు ఆఫర్ల వరుస కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాని రిజెక్ట్ చేసిన ఒక కథకు వైష్ణవ్ తేజ్ ఒకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు ఓ డెబ్యూ డైరెక్టర్ ఒక కథను చెప్పారట.

ఆ సినిమాను నాని తో చేయాలని అనుకున్నారు. కానీ నాని ఆ కథకు నో చెప్పాడట. అయితే అదే కథను వైష్ణవ్ తేజ్ కు చెప్పగా కథ బాగా నచ్చేసి వైష్ణవ్ ఒకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉందంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే వైష్ణవ్ తేజ్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఒక సినిమాకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు రు.3కోట్ల రెమ్యునేషన్ పుచ్చుకుంటున్నాడని తెలుస్తోంది. మరోవైపు బోగవల్లి ప్రసాద్ బ్యానర్ పై కూడా ఒక సినిమా చేసేందుకు వైష్ణవ్ ఒకే చెప్పారట. ఇక ఇప్పటికే వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: