బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఒకవైపు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటూనే పదునైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పిస్తూ ఎప్పడు ట్రేండింగ్ లోనే ఉంటుంది ఈ భామ. ఇక తాజాగా ఈమె ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనాలీ ప్రాంతంలో ఈమెకు ఓ ఇల్లు ఉంది. 2018 లో కంగనా రనౌత్ ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేసింది. ఈ ఇంటికోసం దాదాపు 30 కోట్ల రూపాయలు కంగనా ఖర్చు పెట్టింది. ఇది అలాంటి ఇలాంటి ఇల్లు కాదు, ఏకంగా ఏడు బెడ్ రూమ్ లు, ఏడు బాత్ రూమ్ లు, విశాలంగా ఉన్న హాల్ తో పాటు ఈ ఇంట్లో అన్ని సదుపాయాలు గల ఈ ఇంటి కిటికీల నుంచి బయటకు చూస్తే హిమాలయాలు అతి దగ్గరగా కనిపిస్తాయి.

ఆమె ఒక గదిని అయితే ప్రత్యేకంగా అద్దాలతో డిజైన్ చేయించుకుంది. ఆ గది అంతా ఎక్కడ చూసినా అద్దాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ లలో ఒకరైన శబ్నం గుప్తా ఈ ఇంటిలోని ప్రతి గది అందంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేపట్టారు. ఇలాంటి విలువైన ఇంటి ఫోటోలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. షూటింగ్ అయ్యాక ఇంటికి వచ్చి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే విధంగా కంగనా ఇంటి బెడ్ రూమ్ లు ఉంటాయి.

ఇక ఇంటి లోపల ఉండే మెట్లు రిచ్ లుక్ లో కనిపించేలా కంగనా జాగ్రత్తలు తీసుకుంది. ఇంట్లో గోడలపై కంగనా స్వయంగా వేసిన పెయింటింగ్ లు కన్పిస్తాయి. పుస్తకాలు చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడే కంగనా లివింగ్ రూమ్ లో ఉండే ప్రతి షెల్ఫ్ లో బుక్స్ ఉండేలా చేసుకుంది. మొత్తానికి అధునాతనంగా సకల సౌకర్యాలు ఆ ఇంట్లో దర్శనమిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: