టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ మరో సారి రిపీట్ కానుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ లో.ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' సినిమా ఎంతటి ఘన విజయం సాధిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాటాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సినిమాలో సుకుమార్ కథ, కథనం,పాటలు, చరణ్ నటన ఇలా అన్ని అద్భుతంగా పండాయి.నిజం చెప్పాలంటే అప్పట్లో రాజమౌళి మగధీర సినిమా తర్వాత మళ్ళీ చరణ్ కి ఆ స్థాయి విజయాన్ని సాధించిన సినిమా రంగస్థలం.ఇక బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమాకి ఏకంగా 18 అవార్డులు దక్కాయి.

అందుకే ఈ సినిమా రామ్ చరణ్ కి చాలా స్పెషల్. అటు అభిమానులు సైతం మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఆ సమయం మాత్రం చాలా దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr సినిమాతో పాటు సంచలన దర్శకుడు శంకర్ తో మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో rrr దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇంకా శంకర్ తో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనికి కొంత సమయం పడుతుందని సమాచారం.అయితే శంకర్ తో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్.

వచ్చే ఏడాది వరకు శంకర్ తో సినిమా పూర్తి చేసి సుకుమార్ తో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి చరణ్ సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో పలు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది రంగస్థలం సినిమాకి సీక్వెలా.. లేక కొత్త కథతో ఉంటుందా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న ఈ ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది..ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.ఆగస్టు నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల వాయిదా పడే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: