తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రభాస్ కి మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. దర్శకధీడు రాజమౌళి చిత్రీకరించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాను బట్టి 50 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట.
 
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ తో సినిమాలను నిర్మించాలని ఆశిస్తున్న నిర్మాతల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ప్రభాస్ తో సినిమా చేయాలని బావించారంట. అందుకు దిల్ రాజు ప్రభాస్ ను సంప్రదించగా ప్రభాస్ ఏకంగా 70 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది.

అయితే ప్రభాస్ రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో దిల్ రాజు ఈ సినిమా విషయంలో ముందుకెళ్లాలా..? వద్దా..? అని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ డిమాండ్ కు దిల్ రాజు తలొగ్గుతారో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్ మాత్రమేనని చెప్పాలి మరి. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రభాస్  సినిమా సినిమాకు రేంజ్ అంతకంతకూ పెరుతుతుండటం విశేషంగానే చెప్పాలి.

అంతేకాదు.. ప్రభాస్ తన భవిష్యత్ సినిమాలకు స్టార్ డైరెక్టర్లను, సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం అనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: