నందమూరి వంశం నుంచి ఓ నార్మల్ హీరోగా తెరపై కనిపించి ఇప్పుడు నెంబర్ వన్ హీరోగా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని అనే సినిమాతో పూర్తిస్థాయి హీరోగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది, టెంపర్, జనతాగ్యారేజ్ , అరవింద సమేత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో గా ఉన్నారు. దేశం గర్వించదగ్గ హీరోగా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ దేశంలో మంచి హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఎంతో మంది హీరోయిన్ లు ఈయన సరసన నటించగా చాలామంది నీ ఈయన సినిమా పరిశ్రమకు పరిచయమైన వారే కావడం విశేషం. కొత్త వారికి సైతం మంచి ప్రోత్సహిస్తూ ఎన్టీఆర్ అందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే కమలహాసన్ కూతురు గా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈమె. నటిగా సింగర్ గా మంచి డాన్సర్ గా ఎదుగుతూ కెరీర్ పరంగా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈమె తెలుగులో నటించిన టాప్ హీరోలైన మహేష్ తారక్ చరణ్ కపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ తో నటించిన శృతి తన తో డ్యాన్స్ విషయంలో కంఫర్ట్ గా ఉండేది అని చెప్పింది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటిస్తున్నప్పుడు అతడితో తో సమానం గా నటించలేక చాలా కష్టపడింది. ఆ సమయంలో తనకు చుక్కలు కనపడ్డాయని జూనియర్ ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు కొన్ని సందర్భాల్లో తన టాలీవుడ్ అనుభవాల గురించి చెబుతూ టాప్ హీరోలపై జోకులు పేల్చింది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తన రీ ఎంట్రీ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: