వరుస సినిమాలు భారీ ఫ్లాప్ లు కొడుతున్న కూడా
సందీప్ కిషన్ సినిమా అవకాశాలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండటం లేదు. ఆయన నటించిన తాజా చిత్రం గల్లీ రౌడీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల కాగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆయన కెరీర్ లో మరొక ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ దర్శకుడు తో తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టాడు సందీప్. ఆరు సంవత్సరాల క్రితం ఈ దర్శకుడితో కలిసి పనిచేసిన
సందీప్ ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత ఆ దర్శకుడితో పనిచేయడం విశేషం.
సందీప్ కిషన్ హీరోగా చేసిన టైగర్
సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ
సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా
తమన్ సంగీతం సమకూర్చగా
సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో
సందీప్ కిషన్ మాస్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగా 2016 లో వచ్చిన ఈ
సినిమా తర్వాత వీరిద్దరూ తమ తమ కెరీర్లో బిజీగా ఉండటంతో మళ్ళీ
సినిమా ఇంతవరకు చేయలేదు కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ
సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది...
ఇటీవలే రవితేజతో కలిసి
డిస్కోరాజా అనే
సినిమా చేసిన వి.ఐ.ఆనంద్ ఆ సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు. అంతకుముందు
ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హిట్ కొట్టిన
రవితేజ ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఇప్పుడు మళ్ళీ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు
సందీప్ కిషన్ తో చేతులు కలిపి ఓ
సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇది ఓ సస్పెన్స్
థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ టచ్ కూడా ఉండబోతుంది అని అంటున్నారు.
డిస్కో రాజా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన ఈ
సినిమా ఏవిధంగా ఉండబోతుందో తెలియాలంటే ఈ
సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.