వరుస సినిమాలు భారీ ఫ్లాప్ లు కొడుతున్న కూడా సందీప్ కిషన్ సినిమా అవకాశాలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండటం లేదు. ఆయన నటించిన తాజా చిత్రం గల్లీ రౌడీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల కాగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆయన కెరీర్ లో మరొక ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ దర్శకుడు తో తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టాడు సందీప్. ఆరు సంవత్సరాల క్రితం ఈ దర్శకుడితో కలిసి పనిచేసిన సందీప్ ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత ఆ దర్శకుడితో పనిచేయడం విశేషం.

సందీప్ కిషన్ హీరోగా చేసిన టైగర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా తమన్ సంగీతం సమకూర్చగా సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ మాస్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగా 2016 లో వచ్చిన ఈ సినిమా తర్వాత వీరిద్దరూ తమ తమ కెరీర్లో బిజీగా ఉండటంతో మళ్ళీ సినిమా ఇంతవరకు చేయలేదు కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది...

ఇటీవలే రవితేజతో కలిసి డిస్కోరాజా అనే సినిమా చేసిన వి.ఐ.ఆనంద్ ఆ సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు. అంతకుముందు ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఇప్పుడు మళ్ళీ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సందీప్ కిషన్ తో చేతులు కలిపి ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇది ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ టచ్ కూడా ఉండబోతుంది అని అంటున్నారు. డిస్కో రాజా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన ఈ సినిమా ఏవిధంగా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: