యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. అయినా ఇప్పటివరకు సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట.అందుకోసం ఓ భారీ సెట్ ని కూడా వేస్తున్నారట.కొరటాల శివ సినిమాల్లో కథతో పాటూ,హీరో ఉండే ప్రదేశానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది.

ఆయన గత సినిమాలను ఒకసారి గమనిస్తే ఇది అర్ధమవుతుంది.ఆ ప్రదేశాల కోసం కొరటాల శివ నిర్మాతలతో బాగానే ఖర్చు పెట్టించి మరీ సెట్స్ వేయిస్తుంటాడు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట కొరటాల శివ.ఈ నేపథ్యంలో సినిమా కోసం పెద్ద సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సెట్ ను ఎన్టీఆర్ ఇంటికి దగ్గరలోనే రూపొందిస్తున్నట్లు సమాచారం.అది ఎంత దగ్గర అంటే.. షాట్ ఓకే అయి..ఫోన్ చేస్తే ఎన్టీఆర్ వెంటనే వచ్చే అంత దగ్గరట.ఇక నవంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30 వ సినిమా కావడం.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో..
 
ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో కొనసాగుతోందని.. అందులో ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని అంటున్నారు.ఇక సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని పరిశీలిస్తుందట చిత్ర యూనిట్.ఇప్పటికే ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, రష్మీక మందన్న పేర్లు వినిపించినా.. తాజాగా ఆలియా భట్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్...!!


మరింత సమాచారం తెలుసుకోండి: