మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మొదట్లోనే గోపిచంద్ మలినేని దర్శకత్వం లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, ఈ సినిమా తో కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇలా క్రాక్ సినిమాతో వచ్చిన విజయాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అనే ఉద్దేశంతో రవితేజ వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆ సినిమా లో కమర్షియల్ హంగులతో పాటు మంచి కథ, కథనాలు ఉండాలి అని కూడా ఉండాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి కథలు వచ్చినప్పుడు మాత్రమే ఆ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ,  రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం తెలియజేసింది, ఈ సినిమా తో పాటు రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాల్లో రవితేజ నటిస్తున్నాడు.

సినిమా లతో పాటు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటించడానికి ఇప్పటికే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు, ఇలా క్రేజీ సినిమాల లైనప్ ను సెట్ చేసుకున్న రవితేజ తాజా గా విడుదలైన ఒక సినిమాను మాత్రం తిరస్కరించాడట. రాజ్ తరుణ్ హీరో గా తెరకెక్కి, ఈ మధ్య థియేటర్ లలో విడుదల అయిన అనుభవించు రాజా సినిమా కథను మొదటిగా రవితేజ కు చెప్పగా కమర్షియల్ హంగులు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాను రవితేజ తిరస్కరించినట్టు, ఆ తర్వాత ఇదే కథ ను రాజ్ తరుణ్ హీరో గా తెరకెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వస్తున్న వార్త లపై కొందరు రవితేజ తెలివిగా ఆ సినిమా నుండి తప్పించుకున్నాడు అని అని తమ అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: