త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ ఆ సినిమా ద్వారా తెలుగు లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో ఆమె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమె హీరోయిన్ గా ఇక్కడ స్థిరపడి పోయింది అని చెప్పాలి. అంతకుముందు మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ తన అందం అభినయంతో మలయాళ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నది.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా భారీ స్థాయిలో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె పలు ఆసక్తికర సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా వాటిలో రెండు చిత్రాలు సరసన హీరోయిన్ గా నటించడం ఆమె అభిమానులకు బొత్తిగా నచ్చడం లేదు. నిఖిల్ హీరోగా చేస్తున్న కార్తికేయ2 సినిమాలో ఈమె హీరోయిన్ లో నటిస్తోంది. కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడం వరకు బాగుంది కానీ నిఖిల్ హీరో గా నటిస్తున్న మరొక సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించడం ఆమె అభిమానులకు నచ్చడం లేదు. 

సుకుమార్ నిర్మాణంలో సుకుమార్ కథ కథనాలను అందించిన సినిమా అయిన 18 పేజెస్ చిత్రంలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. పెద్ద హీరోల సరసన నటించాల్సిన సమయంలో ఇలా చిన్న హీరోల సరసన ఆమె నటించడం ఆమె కెరీర్ కు ప్రమాదం కలుగుతుంది అని చెబుతున్నారు. కెరీర్లో పదికి పైగా సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ ఇంకా మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగిలి పోవడమే అభిమానులకు అసలు నచ్చడం లేదు. మంచి విజయాలే ఉన్నా సినిమాలను సరిగా ఎంపిక చేసుకోకపోవడం వల్లనే ఆమెకు ఈ విధమైన పరిస్థితి ఎదురవుతుంది అని అంటున్నారు. నిన్న మొన్న వచ్చిన హీరోయిన్ లు తక్కువ సినిమాలతోనే అగ్రహీరోయిన్ లుగా ఎదుగుతుంటే అనుపమ పరమేశ్వరన్ ఇంకా మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగిలిపోవడం ఎవరికీ నచ్చడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: