జబర్దస్త్ లోని పంచ్ ప్రసాద్ గురించి అందరికి తెలుసు.. పంచ్ ప్రసాద్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నాడని, సాయం చేయండని నూకరాజు కోరాడు. పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసిందే..అయితే తన భార్య తన కోసం కిడ్నీ దానం చేసేందుకు సిద్దంగా ఉందని స్టేజ్ మీదే ఎన్నో సార్లు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. పంచ్ ప్రసాద్ అనారోగ్య విషయంలో మల్లెమాల గానీ, శ్యాం ప్రసాద్ రెడ్డి గానీ ఎలాంటి సాయం చేయలేదంటూ ఇది వరకే ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.


నాగబాబు మాత్రం అందరి దగ్గరా డబ్బులు కలెక్ట్ చేసి పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కోసం దాచి ఉంచాడని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింతగా క్షీణించిందని తెలుస్తోంది.పంచ్ ప్రసాద్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు చెడిపోవడంతో మధ్యలో ఆస్పత్రిలోనే ఉన్నాడు. అప్పుడు జబర్దస్త్ షోను మానేశాడు. ఆ సమయంలోనూ నాగబాబు ఆధ్వర్యంలో డబ్బులు కలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు పంచ్ ప్రసాద్‌కు శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు, జబర్దస్త్ షో అంటూ ఇలా నెలకు మూడు నుంచి నాలుగు లక్షల పని కల్పించింది అంటూ మల్లెమాల గురించి ఆది ఎంతో గొప్పగా చెప్పాడు.


కాగా,ఇప్పుడు అతను నడవలేని పరిస్థితిలో ఉన్నారు.వీల్ చైర్‌కే పరిమితమయ్యేట్టున్నాడని, రెండ్రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకుంటున్నాడని, ప్రాణం కోసంపెద్ద యుద్దమే చేస్తున్నాడంటూ, కాళ్లు బాగా వాచిపోయాయని, అడుగు కూడా ముందుకు వేయలేకపోతోన్నాడంటూ.. సాయం చేయండని నూకరాజు ఈ వీడియోలో ఎమోషనల్ అయ్యాడు.మరి కనీసం ఇప్పుడైనా కూడా పంచ్ ప్రసాద్ కోసం మల్లెమాల ముందుకు వస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఇంత వరకు మల్లెమాల అయితే తన కోసం, తన ఆరోగ్యం కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని తెలుస్తోంది..మరి చివరికి ఏం అవుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: