నందమూరి బాలయ్య స్టేజ్ కనుక ఎక్కితే ఏ వైపు నుంచి మొదలుపెట్టి ఏ వైపు వెళ్తాడు.. ఏం మాట్లాడతాడు.. ఏ పురాణాలను చెబుతాడు..  అన్నది ఎవ్వరూ కూడా ఊహించలేరు. బాలయ్య స్పీచులు ఓ పట్టాన ఎవ్వరికీ కూడా అంతగా అర్థం కావు. అయితే వీర సింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య అలానే మాట్లాడాడని తెలుస్తుంది. ఏం చెప్పాడో ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మీమ్స్ అయితే వచ్చాయి.  తాజాగా వాటి మీద విష్ణుప్రియ కౌంటర్ వేసినట్టుగా తెలుస్తుంది.బాలయ్య ఏం చెప్పాడో అర్థం కాలేదు గానీ.. అయినా సరే అంటూ జై బాలయ్య అని దండం పెట్టేసిందట విష్ణుప్రియ. మామూలుగానే విష్ణుప్రియ ఇలా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ మీద ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతుంటుంది. ఎప్పుడూ తన మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ మీద రియాక్ట్ అయ్యే విష్ణుప్రియ.. మొదటి సారిగా ఇలా బాలయ్య మీద వచ్చిన ట్రోల్స్ మీద కూడా స్పందించింది.  విష్ణుప్రియ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా నే ట్రెండ్ అవుతోంది. విష్ణుప్రియ మరియు రీతూ కలిసి మాల్దీవుల్లో బీచ్‌లో సందడి చేస్తున్నారు. ఇక ఝరీ ఝరీ సాంగే అనే పాట మానస్‌తో కలిసి చేసిన కెమిస్ట్రీతో కూడా బాగానే వైరల్ అవుతోంది. ఈ మధ్య బుల్లితెర షోల మీద కూడా మానస్, విష్ణుప్రియ చేసిన హాట్ రొమాంటిక్ పర్ఫామెన్స్ కూడా చూసి అంతా షాక్ అయ్యారు. ఇక విష్ణుప్రియ పెళ్లి మ్యాటర్ కూడా ఈ మధ్య బాగానే ట్రెండ్ అవుతోంది.  విష్ణుప్రియ సినిమాల వైపు మాత్రం తన ఫోకస్ ను పెట్టడం లేదు. సోషల్ మీడియా మరియు బుల్లితెరపై షోలు చేసుకుంటూ ఆమె బిజీ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు ఇలా ట్రోల్స్ మరియు మీమ్స్ అంటూ సందడి చేస్తుంది. ఇప్పుడు బాలయ్య మీద వేసిన ఈ పోస్ట్ అందరినీ కూడా తెగ ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: