కిషిడా మాట్లాడుతూ, తమ పాలనకు ప్రజల మద్దతు ఉండాలని అందుకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము అన్నారు. ఈ నిర్ణయంతో జపాన్ లో ఈ నెల 31 న సార్వత్రిక ఎన్నిక జరగనుంది. ఆ దేశంలో 2017లో లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కన్జర్వేటివ్ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అత్యధిక మెజారిటీ తో గెలవడంతో షింజో ప్రధాని అయ్యారు. ఆయన 2020 ఆగష్టు 28న అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుండి వైదొలిగారు. అనంతరం యోషిహైజ్ సుగా నూతన ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ లో ఆయన అనేక విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. అలాగే కరోనా సమయంలో సరైన ఆర్థిక విధానాలు అమలు చేయలేకపోవడం లాంటివి ఆయనను పదవి నుండి తప్పుకునేట్టు చేసింది. దానితో అధికార పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించి కిషిడా ను నూతన ప్రధానిగా ఎన్నుకున్నారు.
నూతన ప్రధానిగా కిషిడా పది రోజులు కూడా పదవిలో కొనసాగకముందే దిగువ సభను(లోక్సభ) రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధానిగా మిగిలిపోయారు. ఆయన ప్రజా మద్దతు అంటూ ఈ రద్దు చేసినట్టు చెపుతున్నారు. అందుకే మరోసారి జపాన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో ఆయా పార్టీల బలాబలాలు తేలాలి, అప్పుడు వారు ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు దేశంలో రాష్ట్రపతి పాలనా లేక కిషిడా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.