గత నెల రోజులకు పైగా తెలంగాణ లో ఆర్టీసి సమ్మె జరుగుతున్న సంగతి తెలిసింది. హై కోర్టు లో ఆర్టీసి సమ్మె పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సమ్మె పై విచారణ కొనసాగింది. 


సమ్మె పై రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి సమర్పించింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. న్యాయస్థానం సూచన మేరకు రూ.47కోట్లు చెల్లించినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాబోవని ప్రభుత్వం తెలిపింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు చెల్లించాలన్న హైకోర్టు సూచనను పరిశీలించి అధ్యయనం చేస్తే రూ.2,209 కోట్ల దాకా తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలుండగా ఈ రూ.47 కోట్లు ఏ మూలకూ సరిపోవని ప్రభుత్వం నివేదికలో వివరించింది. మరోవైపు విలీనంపై కార్మికులు మొండిపట్టుతో వ్యవహరిస్తే చర్చలు సాధ్యం కావని హైకోర్టుకు అందజేసిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.


ఆర్టీసి ఎస్మా పరిధిలోకి రాదు: హై కోర్టు 
ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీని ప్రజాప్రయోజన సేవ(పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌)గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య వాదించగా.. ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇక ప్రభుత్వానికి ఆర్టీసి ని చర్చలకు ఆహ్వానించాల్సిందిగా ఎన్నో సార్లు ఆదేశించామని హై కోర్టు పేర్కొంది. తమకు కొన్ని పరిమితులు వుంటాయని వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఈ విషయంలో ఇలా లేదా అలా చెయ్యమని చెప్పే అధికారం తమకు లేదని హై కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం వీలు అయినంత తొందరగా సమ్మె కు ఒక పరిష్కారం కనుగొనాలని సూచించింది,  విచారణను రేపటికి వాయిదా వేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: