చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం సీనియర్ నేత.. పార్టీకి పూర్తి విధేయుడుగా ఉంటారు. ఆయన ఇటీవల తన తనయుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినా అవకాశాలు దక్కలేదు. ఆయన తమ్ముడు వైసీపీలోకి వెళ్లి అనుకోకుండా ఝలక్ ఇచ్చేశాడు. అయితే పార్టీ అధికారం కోల్పోయినా అయ్యన్న పాత్రుడు వంటి నేతలు ఇంకా కమిటెడ్ గానే పని చేస్తున్నారనే చెప్పాలి.

 

అయితే నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకోవడం అయ్యన్నకు అలవాటు. హాస్యంగా మాట్లాడే ఆయన మాట తీరు విలేఖరులకు కూడా ఆసక్తిరేపుతుంటుంది. అయితే తెలుగు దేశాన్ని సపోర్ట్ చేసే లక్ష్యంతో ఇటీవల అయ్యన్న పాత్రుడు మరో అదుపు తప్పి మాట్లాడుతున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. అందుకే ఆయనపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పండిపడుతున్నారు.

 

తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. విశాఖలో మహా నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి మీకు కనబడలేదా..? అని ప్రశ్నించారు. విశాఖ‌లో దాడి వీర‌భ‌ద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నా అంత ఓవర్ యాక్షన్ ఎందుకు అని నిలదీశారు. చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని అయ్యన్నకు తెలియదా..? అని నిలదీశారు.

 

చంద్రబాబు హయాంలో విమ్స్‌ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా..? ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బాబు ఏం చేశారో అయ్యన్నకు తెలియదా..? విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే.. ఈ ప్రాంత వ్యక్తిగా వ్యతిరేకించడం అన్యాయం కాదా..? అని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. కమర్షియల్‌ శాఖ ట్రిబ్యునల్‌ కోర్టును వైయస్‌ఆర్‌ విశాఖలో ఏర్పాటు చేస్తే.. విజయవాడ తరలించినప్పుడు అయ్యన్న ఎందుకు అడ్డుపడలేదని దాడి వీరభద్రరావు మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: