అయితే న్యాయవ్యవస్థ ఏమో కానీ టీడీపీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది వారికి దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేసేస్తోంది.. లేఖ రాసిన తొలి తోజు మౌనంగా ఉన్న వారు ఆ తర్వాత లోపాయకారిగా ఎదో ఒప్పందం చేసుకుని రెండు రోజు నుంచి విమర్శలు చేస్తున్నారు.. ఇక ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుంటున్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో తన వైఖరి ఏమిటో ఎపి ప్రజానికానికి తెలియరావడం లేదు.
ప్రతి చిన్న విషయానికి పొలోమంటూ వచ్చే బీజేపీ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ అవుతున్న కదిలి రాకపోవడంతో వారి వైఖరి ఏంటో అర్థం కావట్లేదు.. గతంలో అంతర్వేది విషయంలో బీజేపీ చేసిన హంగామా మామూలుది కాదు మరి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రజల ప్రశ్న.. డిల్లీలో ఉండే రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కూడా దీని పై స్పందించకపోవడం గమనార్హం. బిజెపిలోని సోము, జివిఎల్ టిడిపి వ్యతిరేకులుగా ముద్రపడ్డారు. ఈ విషయంలో పార్టీలోని టిడిపి అనుకూల ప్రత్యర్థి సామాజిక వర్గీయులు కూడా స్పందించకపోవడం, తెలుగుదేశం మీడియాకు కనీసం లీకేజీలు కూడా ఇవ్వకపోవడం విచిత్రంగా తోస్తోంది.