తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు కీలకంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికల పైన ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటామని
సిద్దిపేట కలెక్టర్ తెలియజేశారు.దుబ్బాక ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులకు సూచించారు.
సిద్దిపేట కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె దుబ్బాక ఉప ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ ఉపఎన్నికలో దాదాపు 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నియోజకవర్గ పరిధిలో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు
కలెక్టర్ తెలియజేసింది. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిటర్నింగ్ అధికారి శ్రీ బి చెన్నయ్య
కలెక్టర్ కు వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పటిష్ట భద్రత చర్యలు చేపడతున్నామన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్నికల నోడల్ అధికారి జయచంద్రా
రెడ్డి కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా
కలెక్టర్ భారతి హోలీ కేరి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేయాలని, నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఎన్నికల కోడ్ సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు, అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఎస్ఎస్టీ, వీడియో వ్యూయింగ్ టీమ్, వీఎస్టీ, ఏంసీఏంసీల పనితీరును, ర్యాండమైజే షన్ గురించి
కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్, వీడియో గ్రఫీ ఏర్పాట్ల పై ప్రశ్నించారు. ఈ నెల 28 వ తేదీలోపు ఫోటో ఓటరు జాబితాను పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ రోజూ కేంద్రాల వద్ద చేతి తొడుగులు, థర్మల్ స్క్రీనింగ్, శాని టైజర్, మాస్క్ లను అందుబాటులో ఉంచాలన్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.
ఎన్నికల రూట్ మ్యాపింగ్, రూట్ అధికారుల నియామకం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.