ఇక జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం అటు అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రంలో కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు... ప్రస్తుతం అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఉదయం సమయంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడ లో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వేయకుండా ఇంట్లో కూర్చో వద్దు అంటూ సూచించారు. ఇక తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దంపతులు నంది నగర్ లోని 8వ పోలింగ్ బూతులో ఓటు వేసి హక్కు వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరు ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు.