[7:09 PM, 3/2/2021] venky New: రెవెన్యూ ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇరువైపుల వాదనలకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. విచారణ లేకుండానే రెవెన్యూ ట్రైబ్యునళ్లలో వివాదాలను తేలుస్తున్నాయన్న పిల్ పై విచారణ జరిగింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణా హైకోర్ట్. విచారణ లేకుండా రికార్డుల ఆధారంగా పరిష్కరించిన కేసులెన్నో తెలపాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల వారీగా రెవెన్యూ ట్రైబ్యునళ్లలో పెండింగ్ కేసుల వివరాలు సమర్పించాలి అని తెలంగాణా హైకోర్ట్ స్పష్టం చేసింది.

ఎన్ని కేసులు బదిలీ చేశారు, ఎన్ని పరిష్కారమయ్యాయో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 18లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్ ఫిర్యాదులన్నీ ట్రైబ్యునళ్లకు బదిలీ చేసామని హైకోర్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.  ట్రైబ్యునళ్లు బదిలీ అయిన కేసులన్నీ దాదాపుగా పరిష్కరించాయి అని ప్రభుత్వం పేర్కొంది. చాలా కేసుల్లో ట్రైబ్యునల్ కు బదిలీ కాకుముందే విచారణ పూర్తయింది అని ఏజీ బీఎస్ ప్రసాద్ వివరించారు. కాగా నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ట్రిబ్యునల్స్ కి బదిలీ చేసారు.

ఇక ఇదిలా ఉంటే మరో కేసుపై కూడా తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరిగింది. గురుకుల పాఠశాలల ప్రిన్సిపళ్ల నియామకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అనర్హులను ఎంపిక చేశారని హైకోర్టులో పలువురు అభ్యర్థుల అత్యవసర పిటిషన్ దాఖలు అయింది. తమకన్నా తక్కువ ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేశారని పిటిషనర్ లు ఆరోపణలు చేసారు. టీఎస్ పీఎస్ సీ రోజుకో తీరు వ్యవహరిస్తోందని న్యాయవాది రచనరెడ్డి వాదనలు వినిపించారు.  నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, టీఎస్ పీఎస్ సీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
[7:16 PM, 3/2/2021] venky New: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతీ ఒక్క విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కీలక అంశాల్లో విపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు; టీడీపీ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జగన్ ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తొలి తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని ఆయన ఆరోపించారు. రిజిస్టర్ విలువ ఆధారంగా పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు. జగన్ కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుంది  అని ఆయన అన్నారు. ఇసుక, సిమెంట్, గ్యాస్, డీజల్, పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగదలతో సామాన్యులపై భారం పడిందని చంద్రబాబు అన్నారు. కష్టకాలంలో పోరాడితేనే నాయకులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందని సూచించారు.

వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య అని ఆయన మండిపడ్డారు. గురువారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా అని స్పష్టం చేసారు. మద్యం సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి టీడీపీ వారిపైనే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరు అని అన్నారు.  ఇలాంటి వాటి పట్ల నాయకులు జాగ్రత్త పడాలి అని ఆయన సూచించారు. ధైర్యంగా పోరాడాలి.. ఏదైనా ఘటన జరిగితే నేను కూడా వచ్చి పోరాడతా అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇళ్లూ తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను  ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: